Friday, 14 July 2017

ప్రైవేటు ఆసుపత్రుల్లో ఇష్టానుసారంగా సిజేరియన్లు

130 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక వ్యవస్థ.... 130 కోట్ల జనాభా... ఒక్కో మనిషికి లక్ష రూపాయలన్నమాట...  ఇదీ భారత ఆర్థిక వ్యవస్థ బలం... మన దేశ జనాభా బలం. ఇప్పుడు దేశమంతా ఒకటే మంత్రాన్ని జపిస్తోంది. ఒకే దేశం... ఒకే పన్ను... ఒకటే మార్కెట్... ఇదీ కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన వస్తు సేవల పన్ను జి.ఎస్.టి ద్వారా తీసుకొచ్చిన సరికొత్త విధానం...  ఎన్నాళ్లో వేచిన ఉదయం... దేశమంతా ఒకటే పన్ను విధానం దేశంలో అమల్లోకి వచ్చింది. పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో జరిగిన కార్యక్రమంలో అర్ధరాత్రి వస్తు సేవల పన్నును రాష్ట్రపతి, ప్రధాని మీటనొక్కి అమల్లోకి తెచ్చారు. వన్ నేషన్... వన్ ట్యాక్స్... వన్ మార్కెట్ దేశ ప్రజలకు  ఏవిధంగా మేలు చేస్తుంది... దేశంలో సమూల మార్పులకు దోహదకారిగా ఎలా నిలవబోతుందన్నదానిపై ఇన్ సైడ్ స్పెషల్ రిపోర్ట్...  జీఎస్టీలో అపోహలు ఎక్కువ... క్లారిటీ తక్కువ...
జీఎస్టీ ఇప్పుడో బ్రహ్మపదార్థంలా మారింది. వస్తు సేవల పన్ను ద్వారా ఏం జరుగుతుందోనన్న అపోహ చాలా మందిలో ఉంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే జీఎస్టీ విషయంలో అపోహలెక్కువ... క్లారిటీ తక్కువన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.  రోజు గడిచే కొద్దీ జీఎస్టీకి సంబంధించి అందరికీ ఫుల్ క్లారిటీ రానుంది. జీఎస్టీ ద్వారా దీర్ఘకాలంలో ప్రజలకు ఎంతో మేలు కలగనుందన్న అభిప్రాయాన్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. జీఎస్టీ ద్వారా... తాత్కాలికంగా ఇబ్బందులున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.అయితే దీర్ఘకాలంలో జీఎస్టీ ద్వారా ఇబ్బందులన్నీ తొలగిపోతాయని ఆర్థిక శాస్త్రవేత్తలు భరోసా ఇస్తున్నారు. జీఎస్టీ ద్వారా సామాన్యుడికి ఎంతో మేలు జరుగుతుందన్నది వారి భావన. దాదాపు రెండు దశాబ్దాల నుంచి కసరత్తు చేసిన జీఎస్టీ.. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అమల్లోకి వచ్చేసింది. నాటి ప్రధాని వాజ్ పేయి జమానా నుంచి జీఎస్టీ అమలు చేయాలన్న లక్ష్యం ప్రభుత్వ పెద్దల్లో ఉంది. తాజాగా అమలు ద్వారా ప్రధాని నరేంద్రమోదీకి క్రెడిట్ దక్కుతోంది. అయితే జీఎస్టీ అమలకు సంబంధించి అపోహలు ఎక్కువగా ఉన్నాయ్. కేంద్రం రాష్ట్రాలను కేంద్రం గుప్పిట్లోకి తెచ్చుకోవాలన్న ప్రయత్నం చేస్తుందన్న అభిప్రాయం కూడా ఉంది. అయితే ఇది కేవలం అపోహ మాత్రమే... జీఎస్టీని వ్యతిరేకించే వారు... ఆదాయమంతా కేంద్రానికే దక్కుతుంది... రాష్ట్రాలు... కేంద్రాన్ని బిచ్చమడుక్కోవాలన్న వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది వాస్తవానికి ఇది ఎంత మాత్రం కరెక్టు కాదు...
అయితే ప్రతిపక్షాలు గుడ్డిగా జీఎస్టీని వ్యతిరేకించడంపై విమర్శలు ఎక్కువవుతున్నాయ్. తెలుగు సినిమా డైలాగు మాదిరిగా ఎక్కడ నెగ్గాలో కాదు... ఎక్కడ తగ్గాలో తెలిసినవాడు నాయకుడన్న చందంగా... ప్రతిపక్షం వ్యవహరించలేదన్న అభిప్రాయం ఉంది. మోదీని ఎదుర్కోవాలి కాబట్టి ఎదుర్కోవడమన్నది కరెక్టు కాదని... ప్రతిపక్షాలు తెలివిగా వ్యవహరించి ఉండాల్సిందన్న అభిప్రాయాన్ని ఆర్థిక వేత్తలు వ్యక్తం చేస్తున్నారు. మోదీని ఎదుర్కోవడంలో విఫలమైన... కాంగ్రెస్ పార్టీ మమత ట్రాప్ లో పడిపోయిందన్న అభిప్రాయం ఉంది. కాంగ్రెస్ ట్రాప్ లో లెఫ్ట్ పార్టీ లు కూడా పడ్డాయన్న వాదన కూడా విన్పిస్తోంది. కొంత మంది అనేక అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే వాటన్నింటికీ సమాధానం దొరకాలంటే మరో ఆరు నెలల పాటు వెయిట్ చేయాల్సిందేనన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.
ప్రపంచంలోని మెజార్టీ దేశాలన్నీ జీఎస్టీని ఎప్పట్నుంచో అమలు చేస్తున్నాయ్. జీఎస్టీ వల్ల లాభం లేకుంటే వారంతా అది చేయరు కదా... జీఎస్టీని ఇంప్లిమెంట్ చేయడం వల్ల పన్ను చెల్లింపు సులభతరమవుతుందని... వ్యాపారులు దేశంలో ఎక్కడైనా వ్యాపారం చేసే వీలు కలుగుతుందని అంటున్నారు. అభివృద్ధి చెందిన దేశాల సరసన ఇప్పుడు భారత్ తీసుకున్న తాజా నిర్ణయం... దేశ ఆర్థిక వ్యవస్థకు నవ పథాన్ని ఆవిష్కృతం చేస్తుందని చెప్పొచ్చన్న అభిప్రాయం కలుగుతోంది. తాజా జీఎస్టీ నిర్ణయం ద్వారా... పలు రకాల పన్ను బాధలు తప్పబోతున్నాయ్.  పన్నులు ఎగ్గొట్టేవారి సంఖ్య భారీగా తగ్గుతుంది. ప్రభుత్వ యంత్రాంగాలు నిజాయితీతో వ్యవహరిస్తే... దేశంలో ప్రభుత్వం చెబుతున్న మార్పు స్పష్టంగా వస్తుంది. జీడీపీలో 2 శాతం వృద్ధి సాధ్యమవుతుంది. లోటును తగ్గించుకోని... దేశ ఆర్థిక వ్యవస్థ పటుత్వాన్ని సాధించడం జరుగుతుంది. వస్తు సేవల పన్ను... జీఎస్టీ ద్వారా కార్పోరేట్లకు మాత్రమే లబ్ధి చేకూరుతుందని అంటున్నారు. అది తప్పన్న అభిప్రాయాన్ని ఆర్థికరంగ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. కార్పోరేట్స్ కు బెనిఫిట్ చేయడానికి జీఎస్టీ తీసుకురాలేదని... తాజా చట్టం ముందు... దేశంలో అందరూ... ఒకటేనన్న అభిప్రాయాన్ని కూడా విన్పిస్తుంది. ఇప్పటి వరకు బడా బడా కార్పోరేట్స్ ప్రభుత్వానికి కట్టాల్సిన పన్ను... అనేక మార్గాల ద్వారా  ఎగ్గొడుతున్నారని...  వారి సంఖ్య జీఎస్టీ అమలుతో...  తగ్గబోతుందని చెబుతున్నారు. పన్ను చెల్లింపు పద్ధతిలో ఇప్పుడు విస్తృతమైన పారదర్శకత పెరుగుతుందన్న అభిప్రాయం బలంగా విన్పిస్తోంది. జీఎస్టీ అమలు ద్వారా... కార్పోరేట్ శక్తులైనా... నెలసరి జీతం తీసుకునే వ్యక్తి అయినా... వారి వారి ట్యాక్స్ స్లాబులోకి వస్తారు. ఇప్పటి వరకు వ్యక్తిగత పన్ను ఏవిధంగానైతే కడుతున్నారో... అదే విధంగా వారి వారి పరిశ్రమలకు సంబంధించిన బిల్లులను చెల్లించాల్సి ఉంటుంది.  మరోవైపు చేనేత పరిశ్రమ కుదేలవుతుందన్న అభిప్రాయాన్ని వస్త్రవ్యాపారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు చేనేతకు వంద శాతం పన్ను  మినహాయింపు లభిస్తూ వచ్చింది. అయితే తాజా నిబంధనలతో రూ. 20 లక్షల పైబడి వార్షిక టర్నోవర్ ఉన్న వ్యాపారులు మాత్రమే పన్ను పరిధిలోకి వస్తారు. అందులోనూ రూ. 75 లక్షల వరకు వ్యాపారం చేసే వారు కేవలం 1 శాతం మాత్రమే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అంతకు మించి వ్యాపారం చేసే వర్గాలు 5 శాతం ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుందని చెబుతున్నారు. అయితే రూ. 20 లక్షల స్లాబులో ఉన్నవారు... అందుకు తగిన విధంగా ఆదాయపన్నుశాఖ వారికి బిల్లులను ఇవ్వాల్సి ఉంటుంది. అది మాత్రం ఇబ్బందికర పరిణామని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటి వరకు పన్ను చెల్లించని వారికి అది కొంచెం ఇబ్బంది కలిగించే విషయం. ఇప్పటి వరకు చిన్న చిన్న వస్త్రవ్యాపారులు రికార్డులన్నీ కూడా పుస్తకాల్లో నిక్షిప్తం చేసేవారు. అయితే అలాంటి వారు కూడా రికార్డుల లెక్కలతో ఐటీవారికి అందిస్తే సరిపోతుంది. రికార్డుల్లో ఆధార్, ప్యాన్ అందిస్తే వారే లెక్కలు చూసుకుంటారు. అలాంటి వారికి పన్ను భారం ఎంత మాత్రం ఉండదు. అయితే దేశ వ్యాప్తంగా ఉన్న వస్త్ర వ్యాపారులు ఒక్కసారిగా ఈ పద్ధతికి అలవాడు పడటం కష్టమన్న అభిప్రాయం కూడా ఉంది. గతంలో నోట్ల రద్దు తర్వాత ఎంతో మంది ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే ఇప్పుడిప్పుడే నాటి గాయాలు మానుతున్నాయ్. ఇప్పుడు జీఎస్టీ పేరుతో వ్యాపారులు, సామాన్యుడి బెదిరిపోతున్నారు. అలాంటి పరిస్థితి రాకుండా... ప్రజలను కాపాడాల్సింది పాలకులే. నోట్ల రద్దు సమయంలో  ఎలాంటి అప్రమత్తత లేకుండా చేయడం వల్ల ఇప్పటికీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. అయితే... ఇప్పుడు జీఎస్టీ ద్వారా సమస్యలు ఉత్పన్నం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వస్తుసేవల పన్ను అమలుకు సంబంధించి తాత్కాలికంగా ఇబ్బందులు ఎదురైనప్పటికీ...దీర్ఘకాలంలో గణనీయంగా ప్రయోజనాలుంటాయన్న అభిప్రాయాన్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. జీఎస్టీ తక్షణం అమలు చేయడం ద్వారా...  మొదట్లో కొన్ని వర్గాలు ఇబ్బందిపడే ప్రమాదం ఉన్నప్పటికీ...  అవగాహన లోపంతో నష్టాలు కూడా వస్తాయన్న అనుమానాలు ఉన్నాయ్.  తెలంగాణ ప్రభుత్వం మిషన్ కాకతీయ, మిషన్ భాగీరథ విషయంలో జీఎస్టీ అమలుతో పలు సమస్యలు వస్తాయని భావించింది. అయితే రోజులు గడిచేకొద్దీ... ప్రభుత్వ పెద్దలు క్లారిటీతో అడుగులు వేస్తున్నారు. అందుకే తెలంగాణ ప్రభుత్వం సైతం మద్దతిస్తుందన్న అభిప్రాయం వ్యక్తమైంది. నాటికీ... నేటికీ అయ్యే ఖర్చులో పెద్ద తేడా ఏమీ ఉండదన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చిందన్న అభిప్రాయం ఉంది. జీఎస్టీ రాక ముందు... సెంట్రల్ వ్యాట్, స్టేట్ వ్యాట్ గా పన్ను విధించేవారు. ఇప్పుడు జీఎస్టీ అమలయ్యాక...  ఇంటిగ్రేటెడ్ జీఎస్టీగా నిర్ణయించారు. స్టేట్ జీఎస్టీ, సెంట్రల్ జీఎస్టీ కలిపి ఇంటిగ్రేట్ గా ఒక పూల్ గా వెళ్తుంది. అయితే కేంద్రమే మొత్తం కంట్రోల్ చేసే పరిస్థితి ఉండదన్న అభిప్రాయాన్ని నిపుణులు వివరిస్తున్నారు. రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాలకు హక్కులను హరించడం సాధ్యం కాదన్న వర్షన్ ను వారు చెబుతున్నారు. 14వ ఆర్థిక సంఘంలో ప్రకారం... ఆయా రాష్ట్రాల వాటాలను ఇప్పటికే లెక్కగట్టారు. దాని ప్రకారం రాష్ట్రాలకు నిధుల చెల్లింపు జరుగుతుంది.

అందరి మదిలో ఒకటే... లాభం జరిగితే మనకే జరగాలి... నష్ట జరిగితే పక్కోడికి జరగాలి... ఇదీ ఎవరైనా అనుకునేదే. అయితే... జీఎస్టీ ఆర్థిక తీవ్రవాదాన్ని తుదముట్టిస్తుందని కేంద్రం చెబుతోంది. అయితే...  జీఎస్టీ ద్వారా మనకు పడే భారమేంటి? జీఎస్టీ అమలు కాక ముందు మనం చెల్లిస్తున్న మొత్తానికి ఇప్పుడు మనం కోల్పోతున్న  లెక్కలేంటి? సామాన్యుడుకు ఒరిగేదేంటి?
స్థానిక మీడియా, జాతీయ మీడియా జీఎస్టీ గురించి పుంకాను పుంకాలుగా వార్తలు అందిస్తోంది. వాటిలో ఎక్కువగా ప్రజలకు, మరీ ముఖ్యంగా కామన్ మ్యాన్ ఫ్రెండ్లీ అంటూ వార్తలు వస్తున్నాయ్. వాటికి సంబంధించిన వివరాలు ఓ సారి చూద్దాం... ఇప్పుడు కేంద్రం తీసుకొచ్చిన జీఎస్టీ పరిధి ఎక్కువ శాతం 5 శాతం పన్ను కిందకే వచ్చినట్టుగా తెలుస్తోంది. పేద వర్గానికి చెందిన ప్రజలతోపాటు, సామాన్యుడికి మ్యాగ్జిమమ్ బెనిఫిట్ కలుగుతుందని చెబుతున్నారు. పేద ప్రజలకు వారి హక్కుగా జీఎస్టీని విశ్లేషిస్తున్నారు. దేశంలోని చిన్నస్థాయి వర్తకులకు జీఎస్టీతో ఎలాంటి ప్రమాదం లేదన్నది కూడా ఘంటాపధంగా వివరిస్తున్నారు. పరిశ్రమ వర్గాలకు మేలు జరుగుతున్న విషయాలను ఓసారి పరిశీలిస్తే... రిజిస్ట్రేషన్ కు సంబంధించిగానీ, డ్యూటీ చెల్లింపులుగానీ, ఐటీ రిటర్న్స్ దఖలు చేయడం, రిఫండ్లను వెనక్కి తీసుకోవడం తేలిక కానుంది. పన్ను చెల్లింపుకు సంబంధించి తయారీదారు, సరుకును సప్లై చేసే వ్యక్తి, రిటైల్ వ్యాపారి అంటూ మూడు రకాల పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదంటున్నారు. పన్ను చెల్లింపుల్లో సరళీకరణ మూలంగా... అంతర్జాతీయ మార్కెట్లోకి దేశం నుంచి ఎగుమతులు పెరిగే అవకాశం ఉంది. తక్కువ ధరలకు వస్తువులను అందించడానికి వర్తకులకు ఎంతగానో అనువుగా ఉంటుందన్న అభిప్రాయం ఉంది. ఇకపై ఒకటే రిజిస్ట్రేషన్ కింద వస్తువులు, సేవలను ఒకటే పాన్ నెంబర్ కింద అందించవచ్చు. మొత్తం చెల్లింపుల్లో సగం  రాష్ట్రానికి సగం కేంద్రానికి దక్కుతుంది.
దేశ ఆర్థిక వ్యవస్థకు జీఎస్టీ మూలంగా ఎంతో మేలు జరగుతుంది. దేశమంతా ఒకటే మార్కెట్ విధానం అమల్లోకి వస్తుంది. భారతదేశం తయారీ రంగంలో వినూత్న ఆవిష్కరణలు జరిగే వేదిక అవుతుంది. పెట్టుబడుల రాక పెరుగుతుంది. మొత్తంగా పెట్టుబడుల రాక ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడానికి కారణమైతే... దేశంలోని నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పన సాధ్యమవుతుంది.
తయారీ రంగం నుంచే ఉద్యోగాల కల్పన జరిగితే... దేశం వేగంగా వృద్థి చెందుతుంది. అదే సమయంలో పన్ను చెల్లింపు తేలిక అవుతోంది. అనేక విధాలుగా కడుతున్న పన్నులు చెల్లింపు  అవసరం ఉండదు. వస్తువులపైనా, సేవలపైనా వేసే పన్ను సరళతరమవుతుంది. కొన్ని రకాల మినహాయింపులతో తేలిక పన్నువిధానం అమల్లోకి వచ్చేస్తోంది. శాంతియుతంగా చట్టాలు  అమల్లోకి  రావడం ద్వారా... దేశమంతటా ఒకటే విధానం అమలవుతుంది. పన్ను యంత్రాంగం సైతం సమర్థవంతంగా పనిచేయడానికి జీఎస్టీ చేయూతనిస్తుంది. దేశ వ్యాప్తంగా ఇప్పుడు 200 రకాల చట్టాలతో పలు నిబంధనలు అమల్లో ఉన్నాయ్. అవన్నీ ఇప్పుడు ఒకటే వ్యవస్థ జీఎస్టీ కిందకు వస్తాయ్. మద్యం తప్పించి దేశంలోని అన్ని రకాల వస్తువులు జీఎస్టీ పరిధిలోకి వస్తాయ్. దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తున్న వస్తుసేవల పన్ను...  జీఎస్టీ... ఆయా రాష్ట్రా వాణిజ్య పన్నుల శాఖ స్వరూపాన్నే మార్చేస్తుంది. శాఖ పేరే మారిపోయి వస్తుసేవల పన్ను శాఖ ముందుకు ఆయా రాష్ట్రాల పేరు రానుంది. జీఎస్టీ కారణంగా రాష్ట్రానికి పన్ను విధించే అధికారం లేని నేపథ్యంలో వాణిజ్య పన్నులు అనే పదాన్ని తొలగించి.. జీఎస్టీ శాఖగా నామకరణం చేస్తారు. దేశంలో జీఎస్టీని అమలు చేయాలన్న ఆలోచన 1986-87లో మొదలైంది. ఆ ఆలోచన అప్పటికే 34 దేశాల్లో అమల్లో ఉండగా... ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 160 దేశాల్లో జీఎస్టీ అమలవుతోంది. అయితే అగ్రరాజ్యం అమెరికాలో మాత్రం జీఎస్టీ అమలు చేయడం లేదు. అక్కడ రాష్ట్రాలదే పన్ను వసూలులో కీలక పాత్ర.  బ్రిజిల్ లో 4-25 శాతం, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాల్లో 20 శాతం, చైనాలో 17 శాతం, మెక్సికోలో 16 శాతం, దక్షిణాఫ్రికాలో 14 శాతం, ఆస్ట్రేలియాలో 10 శాతం, జపాన్,స్విట్జర్లాండ్ లో 8 శాతం, థాయ్ లాండ్ లో 7 శాతం, మలేసియాలో 6 శాతం, కెనడాలో 5 శాతం పన్ను వసూలు చేస్తున్నారు.  ప్రపంచంలో తొలిసారి జీఎస్టీని అమలు చేసిన దేశం ఫ్రాన్స్. జీఎస్టీ వచ్చినా... ఆ పన్ను వస్తుంది... ఈ పన్ను వస్తుంది అన్న అనుమానం చాలా మందికి కలుగుతుంది.  అయితే ద్వారా ఏఏ పన్నులు పొతున్నాయో ఒక్కసారి పరిశీలిస్తే...  ప్రస్తుతం కేంద్రం ఆయా వస్తువులు,  సేవలకు సంబంధించి విధిస్తున్న పన్నులు...  కేంద్ర ఎక్సైజ్ సుంకం, ఔషధాలు, సౌందర్య సాధనాలపై వేసే ఎక్సైజ్ సుంకాలు, అనదపు ఎక్సైజ్ సుంకాలను జౌళి, వాటి ఉత్పత్తులపై విధిస్తు్న్నారు. సీవీడీగా పిలిచే... అదనపు కస్టమ్స్ సుంకాలు, ప్రత్యేక అదనపు కస్టమ్స్ సుంకాలు, సర్వీస్ ట్యాక్స్, వస్తు, సేవలపై కేంద్రం విధించే సర్ ఛార్జులు, సెస్సులు ఇకపై ఉండవు. అదే సమయంలో జీఎస్టీ మూలంగా రాష్ట్రాలు విధిస్తున్న పన్నులు ఇకపై పూర్తిగా నిర్మూలించడం జరుగుతుంది. రాష్ట్ర విధించే పన్నులు... విలువ ఆధారిత పన్ను వ్యాట్, కేంద్ర అమ్మకం పన్ను, విలాస సుంకం, ప్రవేశ సుంకాలు, వినోదపు పన్ను, ప్రకటనలపై విధించే పన్ను, కొనుగోలు సుంకం, లాటరీలు, పందాలు, జూదాలపై విధించే పన్నులు పూర్తిగా పోతాయ్. ఆర్థికంగా దేశమంతా ఒక యూనిట్ కిందకు జీఎస్టీ తీసుకొస్తుంది. సరుకులు, సేవలకు సంబంధించి స్వేచ్ఛా వాణిజ్యం సాధ్యమవుతుంది. పెరిగే పోటీతత్వం ద్వారా వినియోగదారులకు తక్కువ ధరకు వస్తువులు లభ్యమవుతాయ్.  ఉత్పత్తిదారులు... వినియోగదారులది దేశమంతా ఒకటే మాట... ఒకటే బాటగా ఉంటుంది. దేశమంతా ఒకటేనన్న భావన కలుగుతుంది. జూలై 1ని జీఎస్టీ దినోత్సవంగా కేంద్రం ప్రకటించింది.

జీఎస్టీ ద్వారా వస్తువుల ధరలు పెరగడం, తగ్గడం జరుగుతున్నాయ్. నిత్యవసర వస్తువుల ధరల్లో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేస్తున్నారు. అయితే...  జీఎస్టీ ద్వారా పెరుగుతున్న వస్తువుల ధరలు ఏంటి? తగ్గుతున్న వస్తువుల ధరలు ఏంటి? ఎవరు ఎంత చెప్పినా క్లారిటీ రావడం లేదా... అయితే ఫుల్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం మేం చేస్తున్నాం...
వస్తు, సేవల పన్ను, జీఎస్టీ అమలు ద్వారా పన్నుల శ్లాబులను నాలుగు రకాలుగా వర్గీకరించారు. 5 శాతం, 12 శాతం 18 శాతం, 28 శాతంగా నాలుగు రకాలుగా పన్నులు వసూలు జరుగుతుంది. అయితే కీలక నిత్యవసర వస్తువుల ధరల్లో ఎలాంటి మార్పు రాకుండా వాటి విషయంలో ఇప్పటి వరకు ఉన్న కొన్ని పన్నులను పూర్తిగా ఎత్తివేశారు. అంటే ఇప్పటి వరకు పాల ఉత్పత్తులు, ఇతర నిత్యవసర వస్తువులపై ఉన్న స్వల్ప పన్నులు కూడా ఇకపై ఉండబోవన్నమాట. జీఎస్టీ అమలుతో పలు వస్తువుల రేట్లు పెరుగుతాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఆయా రేట్ల తయారీ సంస్థలు రేట్లు పెరగకుండా... తమ ఆదాయాన్నే తగ్గించుకుంటాయని స్పష్టం చేస్తున్నాయ్. ఇప్పటికే ద్విచక్రవాహనాలు సంస్థలు, భారీ వాహనాల తయారీ సంస్థలు రెట్లను తగ్గిస్తున్నాయని చెప్పాయ్. హీరో, హోండా సంస్థలు ద్విచక్రవాహనాలపై రూ. 3 వేల నుంచి 5 వేల వరకు తగ్గింపు ప్రకటించాయ్. తాజాగా అదే దారిలో సెల్ ఫోన్ తయారీ సంస్థలు ధరలు తగ్గిస్తున్నట్టుగా పేర్కొన్నాయ్. మొన్నటి వరకు ఇంపోర్ట్ చేసుకున్న సెల్ ఫోన్ ధరలపై 5 శాతం వ్యాట్, ఒక శాతం ఎక్సైజ్ డ్యూటీని విధించేవారు. అయితే ఇప్పుడు జీఎస్టీ కింద 12 శాతం పన్నును ప్రతిపాదించారు. అంటే ట్యాక్స్ డబుల్ అయ్యింది. అయితే వినియోగదారులు ఎక్కడ తమ సెల్ ఫోన్లు కొనుగోలు చేయరన్న బెంగలో ఉన్న కంపెనీలు...  తామే లాభాలను తగ్గించుకుంటామంటూ ముందుకు వచ్చాయ్. జీఎస్టీ కారణంతో తమ ధరలను పెంచబోమని శాంసంగ్‌, షియోమి, ఒప్పో, జియోనీ, ఇంటెక్స్‌, లావా కంపెనీలు చెప్పాయి. ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్ (ఎఫ్.ఎం.సి.జి) ఉత్పత్తులలోని 81 శాతానికి పైగా ఉత్పత్తులకు 18 శాతం పన్నుగా నిర్ణయించారు.  వీటి పన్ను గతంలో 22 నుంచి 24 శాతం వరకు ఉంది. ఈ మేరకు నాలుగు నుంచి 6 శాతం మేర ఉత్పత్తుల ధరలను ఆయా కంపెనీలు వినియోగదారులకు అందించాల్సి ఉంటుంది. ప్యాకేజ్డ్ ఫుడ్స్ ధరల్లో మార్పులు వినియోగదారులకు  తాజా తగ్గింపు వల్ల ఉత్పత్తులకు గిరాకి పెరుగుతుందని... ఆర్థిక వృద్ధికి కారణమవుతుందని అంచనా వేస్తున్నారు. అదే సమయంలో పెయింట్లు, షాంపూలు, డిటర్జంట్లపై మాత్రం 28 శాతం పన్ను విధించారు. ఇవి ఎఫ్.ఎం.సి.జీ ఉత్పత్తుల్లో 19 శాతం ఉన్నాయ్. సిమెంటుకు జీఎస్‌టీనీ 28 శాతంగా నిర్ణయించారు. గతంలో సిమెంట్‌పై పరోక్ష పన్నుల కింద 24- 25 శాతం వరకు వసూలు చేసేవారు. బొగ్గురేటుపై పన్ను తగ్గించినందు వల్ల సిమెంట్ ధరల్లో పెద్దగా వ్యాత్యాసం రాదన్న అభిప్రాయం విన్పిస్తోంది. నిర్మాణాలపై జీఎస్‌టీ రేటు 18 శాతంగా నిర్ణయించినా, భూమి విలువను మినహాయిస్తున్నందున, చెల్లించేది 12 శాతమే ఉండనుంది. ఇక తయారీ రంగం లో వస్తున్న మార్పులు అలా ఉంటే... కీలకమైన సేవల రంగంలో... దీని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం కన్పిస్తోంది. గతంలో అన్ని రకాల సేవలపై 15 శాతం పన్ను విధించేవారు. జీఎస్‌టీలో సేవలపై 5%, 12%, 18%, 28% చొప్పున పన్ను రేట్లను ఖరారు చేశారు. టెలికాం, ఆర్థిక సేవలపై 18 శాతం  పన్ను విధించారు. గతంతో పోలిస్తే 3 శాతం ఎక్కువ.  ఇక బ్యాంకింగ్ సేవలతో జనం జేబులుకు చిల్లుల పడటం ఖాయం. ఇప్పటి వరకు క్రెడిట్ కార్డులపైనా, ఇన్సూరెన్స్ ప్రీమియమ్లపైనా బిల్లులు తడిసిమోపడవనున్నాయ్. ఇప్పటి వరకు ఆ పన్ను 15 శాతంగా ఉండగా... ఇకపై అది 18 శాతానికి  పెరగుతుంది. క్రెడిట్ కార్డును పది వేల రూపాయల బిల్లు వస్తే ఇకపై 18 శాతం పన్నుతో రూ. 180 టాక్స్ కట్టాల్సి ఉంటుంది. ఇక ఇన్సూరెన్స్ ప్రీమియమ్లకు సైతం అదే విధంగా ఛార్జి వసూలు చేస్తారు. రూ. 20 వేల ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించేవారు రూ. 360 టాక్స్ కట్టాల్సిందే.  రవాణా సేవలపై జీఎస్‌టీని 5 శాతం విధించనున్నారు. ఇది విమానయాన సంస్థలకు కలిసొచ్చే పరిణామం. అంతక్రితం ఉన్న 15 శాతంతో పోలిస్తే పన్ను భారం గణనీయంగా తగ్గుతుండటమే కారణం. సినిమా టిక్కెట్లపై జీఎస్‌టీని అత్యధిక స్లాబైన 28 శాతంగా నిర్ణయించారు. గతంలో సినిమా టికెట్లపై సేవా పన్నుతో పాటు వినోదపు పన్ను కింద 28 శాతం నుంచి 100 శాతం వరకు ఉండేది.  పైవ్‌ స్టార్‌ హోటళ్ల సేవలను కూడా 28 శాతం స్లాబ్‌లోకి చేర్చారు. ఎలక్ట్రానిక్ వస్తువులపై 28 శాతం పన్ను ఖరారు చేశారు. గతంలో గృహోపకరణాలపై 23 శాతం పన్ను ఉండగా... అది 5 శాతం మేర పెరగనుంది. టీవీలు, ఫ్రిజ్ లు, ఏసీల ధరలు 2 నుంచి 5 శాతం మేర పెరిగే అవకాశం స్పష్టంగా కన్పిస్తోంది. ఎలక్ట్రానిక్ పరికరాలపై కంపెనీలపై కంపెనీలు 5 శాతం మేరకు ఆదాయాలను తగ్గించుకోవాల్సి ఉంటుంది. ఇక బంగారంపై జీఎస్టీని 3 శాతంగా నిర్ణయించారు. గతంలో అన్ని రకాల పన్నులు కలుపుకొని 12.4 శాతంగా ఉన్న పన్ను... ఇప్పుడు 14 శాతమవుతోంది. దాంతో బంగారు అభరణాలపై ఛార్జీలు స్వల్పంగా పెరగనున్నాయ్. పాల ఉత్పత్తులు కూడా తగ్గే అవకాశం కన్పిస్తుంది. ఇప్పటికే కొన్ని సంస్థలు ధరలు తగ్గిస్తున్నట్టుగా ప్రకటించాయ్. త్వరలో ఇతర పాల ఉత్పత్తుల సంస్థలు సైతం ధరలు తగ్గించే అవకాశం ఉంది. జీఎస్టీ ప్రభావంతో కార్ల ధరలు కిందకి దిగొస్తున్నాయి. దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్‌ తన కార్ల ఎక్స్‌షోరూం ధరలన్నింటి పైనా 3 శాతం వరకు తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. ఇప్పటి వరకు కార్లపై 28 శాతం కంటే పన్ను ఉండటం వల్ల...  జీఎస్టీ అమలు తర్వాత కార్ల రేట్లు కొంత మేర తగ్గబోతున్నాయ్. ఆల్టో, స్విఫ్ట్‌, డిజైర్‌, ఐ20 ఎలైట్‌ వంటి కార్లపై కనీసంగా రూ.6,500 నుంచి .. రూ.15వేల వరకు ధరలు తగ్గబోతున్నాయ్.  ప్రస్తుతం ఈ కార్లపై 31.4 శాతం పన్ను రేట్లు ఉండగా.. వాటిని జీఎస్టీ రేటు కింద 29 శాతానికే తీసుకొచ్చారు. మిడ్‌ సైజు కార్లపై పన్ను రేట్లు ​కూడా 3.6 శాతం మేర తగ్గుతున్నాయ్. హోండా సిటీ, హ్యుందాయ్‌ వెర్నా, మారుతీ సియాజ్‌, ఫోక్స్‌వాగన్‌ వెంటో వంటి సెడాన్ల ధరలు కనీసం 30వేల రూపాయల వరకు తగ్గనున్నాయ్. మెర్సిడెస్‌ బెంజ్‌, బీఎండబ్ల్యూ, ఆడీ, జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ వంటి కంపెనీలు ఇప్పటికే రూ.1.25 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు ధరలను తగ్గిస్తున్నట్టు ప్రకటించాయి.
సింపుల్ గా చెప్పాలంటే... రెడీ మేడ్ దుస్తులపై ఇప్పటి వరకు ఉన్న 12 శాతం పన్ను బదులు 5 శాతం పన్ను వసూలు చేస్తారు. హెయిర్ ఆయిల్, టూత్ పేస్టులు, సబ్బులు, చాక్లెట్లు, బిస్కెట్లు, బర్త్ డే కేకుల రేట్లు గతం కంటే తగ్గుతాయ్. 28 శాతం నుంచి 18 శాతానికి పన్ను తగ్గుతోంది. టీ, కాఫీ పౌడర్  రేట్లు 11 శాతం మేర తగ్గుతాయ్. చక్కరె పన్ను 5 శాతం స్లాబులో మారుతోంది. చెప్పులు, బూట్ల ధరలు కూడా కొంత తగ్గుతాయ్. రూ. 500 లోపు ఉన్న వాటిపై 5 శాతమే పన్ను విధిస్తున్నారు. ఫర్నిచర్ 29 శాతం నుంచి 12 శాతం పరిధిలో వస్తోంది. ఫోన్లు 6 శాతం నుంచి 12 శాతానికి మారుతున్నాయ్. బైకుల రేట్లు కొంత వరకు దిగొస్తాయ్. ఖరీదైన కార్ల ధరలు తగ్గుతున్నాయ్.
దేశ ఆర్థిక వ్యవస్థ స్థితిగతులను మార్చే జీఎస్టీ విషయంలో విభేదాలు రాజకీయ దుమారాన్ని సృష్టిస్తున్నాయ్. కాంగ్రెస్, టీఎంసీ, లెఫ్ట్ పార్టీలు జీఎస్టీ ప్రారంభ కార్యక్రమాన్ని నిషేధిస్తే... ఎన్సీపీ, ఎస్పీ, బీఎస్పీ పార్టీలు సమర్థించాయ్.  ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిపై పోరు సాగించిన విపక్షాలు జీఎస్టీ విషయంలో మాత్రం చీలిపోయాయ్. కాంగ్రెస్ పార్టీ జీఎస్టీని వీలైనంత త్వరగా అమలు చేయాలని చాన్నాళ్ల క్రితమే ప్రయత్నించింది. అయితే తాజాగా జీఎస్టీ విషయంలో కాంగ్రెస్ పార్టీ అనుసరించిన వైఖరిపై రాజకీయ విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు. దేశానికి అత్యంత  కీలకమైన బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొంది... అమలు చేస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా వ్యవహరించకూడదన్న అభిప్రాయం విన్పిస్తోంది. పెద్ద నోట్ల రద్దు మాదిరిగానే జీఎస్‌టీని దూరదృష్టి లేకుండా అమలు చేస్తున్నారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్  దుయ్యబట్టారు. జీఎస్‌టీని కాంగ్రెస్ మొదటి నుంచి బలపరుస్తోందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. అయితే దీనిని అసమర్థ, మతిలేని ప్రభుత్వం ఎలాంటి ప్రణాళిక, దూరదృష్టి, సంస్థాగత సన్నద్ధత లేకుండా అమలు చేస్తోందన్నారు. మరోవైపు జీఎస్‌టీ పన్నుపై కేంద్ర ఆర్థికశాఖ మాజీ మంత్రి చిదంబరం పెదవి విరిచారు. ఇప్పుడు అమల్లోకి వచ్చింది  జీఎస్‌టీ కాదని... నిపుణులు తయారు చేసిన ముసాయిదా ప్రకారం లేదని...  ద్రవ్యోల్బణంపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని ఆయన హెచ్చరించారు. అయితే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో పెద్దన్న పాత్ర పోషిస్తే... ఇప్పుడే అదే పార్టీలు జీఎస్టీ ఆవిర్భావ కార్యక్రమానికి ముందు వరుసలో ఉండటం విశేషం. విపక్షంలో కీలక నేతగా ఉన్న ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అందరికంటే ముందు వరసులో అద్వానీ పక్క సీట్లో కూర్చోవడం విశేషం. అదే సమయంలో బీఎస్పీ, ఎస్పీ పార్టీ నేతలు సైతం హాజరయ్యారు. ఇక మాజీ ప్రధాని దేవగౌడ సైతం ప్రధాన వేదికపై కూర్చోవడం విశేషం. జీఎస్టీ ఆవిర్భావ కార్యక్రమాన్ని బాయ్ కాట్ చేసిన పార్టీల్లో కాంగ్రెస్, తృణముల్ కాంగ్రెస్, లెఫ్ట్, డీఎంకే, ఎన్సీ, ఆర్జేడీతోసహా కొన్ని చిన్న చితకా పార్టీలున్నాయ్. బెంగాల్ సీఎం మమత బెనర్జీ... జీఎస్టీ అమలును తూర్పారబడుతున్నారు. జీఎస్టీ చారిత్ర తప్పిదమంటూ మమత బెనర్జీ మండిపడుతున్నారు. జీఎస్టీ బదులు దేశమంతటికీ సమగ్రమైన బిల్లు తీసుకొస్తే సరిపోయేదన్న అభిప్రాయాన్ని ఆమె విన్పిస్తున్నారు. మొత్తం జీఎస్టీపై రాజకీయ పార్టీల్లో విభేదాలు స్పష్టంగా కన్పించాయ్. ప్రభుత్వం తన పంతం నెగ్గించుకుంటోంది. ఇది ఏ ఒక్క పార్టీకి సంబంధించిన అంశం కాదని... దేశానికి సంబంధించి విషయమని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు. నిజమే.... జీఎస్టీ కేంద్ర ఆర్థిక వ్యవస్థ రూపురేఖలు మార్చే బిల్లు అనడంలో ఎంత మాత్రం అనుమానం లేదు.
కంపెనీలకు అన్ని లాజిక్కులూ తెలుసు. జీఎస్టీ ద్వారా కేంద్రం 5, 12, 18, 28 శాతమంటూ ట్యాక్సులను తీసుకొస్తే... కార్పోరేట్ కంపెనీలు తమ ఉత్పత్తులు అమ్ముకోడానికి 5, 10, 15, 25 శాతం డిస్కౌంట్లంటూ వినియోగదారులను ఊరిస్తున్నాయ్. రండి బాబు రండి  ఇంతకంటే చౌక బేరం ఇక లేదంటూ జనాలకు గాలం వేస్తున్నాయ్.

No comments:

Post a Comment