దిల్లీ: వడ్డీ వ్యాపారి... మొదట కొంచం డబ్బు ఇస్తాడు... అనంతరం అవసరానికి మళ్లీ ఇస్తాడు... చివరకు మనం కట్టకపోతే వడ్డీతో పాటు అసలు మొత్తానికి దొంగ లెక్కలు వేసి మన దగ్గర ఉన్న స్థిరాస్తులను తన పేరుపై రాయించుకుంటాడు. సాధారణంగా సినిమాల్లో ఇలాంటి సన్నివేశాలను చూస్తుంటాం. అయితే ప్రపంచంలోని బీదదేశాలకు అభివృద్ధి పేరుతో రుణాలను ఇచ్చి కొంతకాలానికి అక్కడ ఉన్న విలువైన ప్రాజెక్టులను తక్కువ మొత్తానికి లీజుకు తీసుకునే దేశాలు వస్తున్నాయి. వీటితో చైనా అగ్రభాగంలో ఉండటం గమనార్హం.
అభివృద్ధి పేరుతో...
కొన్నేళ్ల కిందట శ్రీలంకకు చైనా భారీ ఆర్థికసాయం అందించేందుకు ముందుకువచ్చింది. మౌలిక నిర్మాణాలకు రుణాలను ఇస్తామన్న చైనా ప్రకటనలకు శ్రీలంక అప్పటి అధ్యక్షుడు మహీందా రాజపక్స అంగీకరించారు. ఆయన సొంత నియోజకవర్గం హంబన్టొట సముద్రతీరంలో ఉండటంతో అక్కడ భారీ నౌకాశ్రయం నిర్మిస్తామని చైనీయులు ప్రకటించారు. తీరా నిర్మాణం పూర్తయింది అయితే అనుకున్నంతగా ఆదాయం రాకపోవడంతో 99 సంవత్సరాల పాటు హంబన్టొట నౌకాశ్రయంతో పాటు సమీపంలోని వేలాది ఎకరాలను భూములను చైనీయులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ఇరు దేశాల మధ్య ఒప్పందం కూడా కుదరడం గమనార్హం. చైనా కుయుక్తులను గమనించిన స్థానికులు వేలాదిమంది ఆందోళన చేసినా ఫలితం లేకుండాపోయింది.
పాక్లోనూ...
వన్బెల్ట్ వన్ రోడ్ పేరిట పాక్లోని గ్వదర్ నుంచి చైనాలోని కష్గర్ వరకు చైనా-పాక్ ఎకనామిక్ కారిడార్ అనే రహదారిని చైనా నిర్మించింది. ఈ ప్రాజెక్టుతో పాక్ రూపురేఖలు మారిపోతాయని నమ్మించి ఏకంగా 65 బిలియన్ అమెరికన్ డాలర్ల రుణాన్ని అందించింది. కానీ ఇందుకు భిన్నంగా రహదారి ద్వారా చైనా ఆధిపత్యం చలాయించడం గమనార్హం. ప్రాజెక్టు పరిరక్షణ పేరుతో ఏకంగా వేలమంది సైనికులను ఆ మార్గంలో మోహరించడం గమనార్హం. చైనా నుంచి కోట్లాది డాలర్ల విలువైన సరుకులు రహదారి ద్వారా పాక్ మార్కెట్లోకి వచ్చిపడుతున్నాయి. దీంతో స్థానిక తయారీదారులకు, వ్యాపారులకు దిక్కుతోచడం లేదు. ఇక స్వల్ప వడ్డీరేట్లంటూ వూదరగొడుతున్న చైనా వడ్డీ రేటు ఎక్కువగా ఉంటోందని అంతర్జాతీయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ప్రపంచబ్యాంకు రుణాల వడ్డీ కంటే చైనా వడ్డీరేట్లు ఎక్కువగా ఉండటం విశేషం. చైనా నుంచి రుణాలు పొందిన దేశాలు క్రమేణా రుణవూబిలో చిక్కుకుంటున్నాయి. పాక్కు కూడా కొన్నిరోజులకు శ్రీలంక గతే పడుతుందని పాక్ నిపుణులు హెచ్చరిస్తున్నాపాక్ సర్కారు పట్టించుకోకపోవడం లేదు.
No comments:
Post a Comment